కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

VijayaBhaskar · June 18, 2026
Spread the love

ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ లాక్ అప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండ్ చేసింది స‌ర్కార్. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించారు. ఈరోజు డీజీపీని పిలిపించి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా నాగరాజు ను వీ ఆర్ కు బదిలీ చేసిన విజయవాడ కమిషనర్.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ గా పరిగణించారు సీఎం. నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం సూచించడంతో సాయంత్రం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ గుప్తా. మరోవైపు సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. నాగరాజు దోషిగా తేలితే చట్టపరంగా కేసులు పెట్టీ అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.