25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

Spread the love

29 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు

తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లు ఘ‌నంగా చేస్తోంది టీటీడీ. ఉత్స‌వాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా ఈ ఉత్స‌వాల‌లో గజ వాహన, గరుడ వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్నాయి.

జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు టీటీడీ జేఈఓ డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, నరసింహమూర్తి, విజివో గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

    Spread the love

    Spread the loveత‌న‌తో పాటు కుటుంబం కూడా స్వామి ద‌ర్శ‌నం తిరుమ‌ల : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. త‌న సార‌థ్యంలోనే పార్టీ రాష్ట్రంలో…

    వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

    Spread the love

    Spread the loveప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *