స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పు దారి పడుతున్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నాం. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. శిక్షలు కూడా పడుతున్నాయి.
ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను పక్కాగా పాటించాలి. ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలి. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంఛ్ చేయాల్సి ఉంది. ఈలోగా క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





