శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

Spread the love


కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా

తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా గవర్నర్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.. అనంతరం శ్రీకాళహస్తి ఆలయంకు వెళ్లి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సంద‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికింది. ప్రోటోకాల్ స‌మ‌యంలో త‌న‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించింది.

  • Related Posts

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    Spread the love

    Spread the loveదాత‌ల‌ను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య‌, వైద్యం, అన్న‌దానం , భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి…

    25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

    Spread the love

    Spread the love29 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లు ఘ‌నంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *