శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్


కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా

తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాగా గవర్నర్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.. అనంతరం శ్రీకాళహస్తి ఆలయంకు వెళ్లి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సంద‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి సాద‌రంగా స్వాగ‌తం ప‌లికింది. ప్రోటోకాల్ స‌మ‌యంలో త‌న‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించింది.

  • Related Posts

    నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

    న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సంద‌ర్బంగా…

    శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

    తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *