అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు

Spread the love

25 మందిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న సిట్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్ప‌ట్లో అద్వానీ సార‌థ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేప‌ట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే దాదాపు రూ. 1400 కోట్లు పోగు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీటికి సంబంధించి లెక్కా ప‌త్రం లేకుండా పోయింది. తాజాగా అయోధ్య మందిర నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. హిందూ బంధువులు కొంద‌రు దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. చివ‌ర‌కు కేసుల న‌మోదు దాకా వెళ్లింది. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ కేసుకు సంబంధించి తాజాగా అప్ డేట్ వ‌చ్చింది. అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో 150 మంది అనుమానితులను గుర్తించింది సిట్.

దాదాపు 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఐదుగురు ప్రధాన నిందితులు లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం తీసుకున్నారు. అలాగే ఒక మహిళా భక్తురాలు మందిరంలో తన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన కేసు కూడా దర్యాప్తు జ‌రుగుతోంది. జూన్ 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల డబ్బులు దొంగిలించారని యూపీ మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపణలతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

  • Related Posts

    శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    Spread the love

    Spread the loveకుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు…

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    Spread the love

    Spread the loveదాత‌ల‌ను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య‌, వైద్యం, అన్న‌దానం , భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *