టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం
తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా టీటీడీ పెద్ద ఎత్తున వనాలను అభివృద్ది చేస్తోంది. ఇదిలా ఉండగా తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను ఆకస్మికంగా పరిశీలించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వనాలను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుమలలో GNC, గీత పార్క్ , నామాల పార్క్ వంటి వివిధ ఉద్యానవనాలను పరిశీలించి టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని చెప్పారు . టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సీఎఫ్ ఫణి కుమార్ నాయుడు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.








