నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడు, ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పలు చోట్ల ఓటరు నమోదు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ పై కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉండగగా మంగళవారం అనేక చోట్ల ఓటర్ ఐడి నమోదుకు సంబంధించిన కేసులో నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్పై బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినట్లు సమాచారం. పదేపదే సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన కోర్టుకు హాజరు కాక పోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది; అయితే ఈ ఆరోపణలు ఇంకా న్యాయస్థానం పరిశీలనలో ఉన్నాయి . కోర్టులో ఇంకా రుజువు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా నటుడు ప్రకాష్ రాజ్ ఈ నాన్ బెయిలబుట్ వారెంట్ జారీకి సంబంధించి ఇంకా స్పందించ లేదు.







