ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్

ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్త‌కంలో ఆనాటి ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన అత్య‌యిక ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ)కి సంబంధించిన పాఠ్యాంశం చేర్చ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికి కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపింది. ఆనాటి ఎమ‌ర్జెన్సీలో దేశంలో మాన‌వ హ‌క్కులు ఎలా కాల‌రాయ బ‌డ్డాయో నేటి విద్యార్థులు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎంపీ సంజ‌య్ రౌత్. గురువారం ఆయ‌న ముంబైలో జ‌రిగిన ఈ స‌మావేశంలో మాట్లాడారు. ఎమర్జెన్సీ అనేది ఒక రాజ్యాంగ నిబంధన మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో గ‌త 12 ఏళ్లుగా బీజేపీ పాల‌న‌లో అప్ర‌క‌టిక ఎమ‌ర్జెన్సీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు .ఇందిర మన పార్టీని ఎప్పుడూ చీల్చలేదని అన్నారు. ఆమె జైలులో ఉన్న సంఘ్ నాయకులకు 5 స్టార్ ట్రీట్‌మెంట్ ఇచ్చార‌న్నారు. వారికి 5 స్టార్ చెఫ్‌లను ఏర్పాటు చేశార‌న్నారు. పాఠ్యప్రణాళిక నుండి ఎమర్జెన్సీని వెంటనే తొలగించాల‌ని సంజ‌య్ రౌత్ డిమాండ్ చేశారు.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *