ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

Spread the love

ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్

ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్త‌కంలో ఆనాటి ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన అత్య‌యిక ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ)కి సంబంధించిన పాఠ్యాంశం చేర్చ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికి కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపింది. ఆనాటి ఎమ‌ర్జెన్సీలో దేశంలో మాన‌వ హ‌క్కులు ఎలా కాల‌రాయ బ‌డ్డాయో నేటి విద్యార్థులు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎంపీ సంజ‌య్ రౌత్. గురువారం ఆయ‌న ముంబైలో జ‌రిగిన ఈ స‌మావేశంలో మాట్లాడారు. ఎమర్జెన్సీ అనేది ఒక రాజ్యాంగ నిబంధన మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో గ‌త 12 ఏళ్లుగా బీజేపీ పాల‌న‌లో అప్ర‌క‌టిక ఎమ‌ర్జెన్సీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు .ఇందిర మన పార్టీని ఎప్పుడూ చీల్చలేదని అన్నారు. ఆమె జైలులో ఉన్న సంఘ్ నాయకులకు 5 స్టార్ ట్రీట్‌మెంట్ ఇచ్చార‌న్నారు. వారికి 5 స్టార్ చెఫ్‌లను ఏర్పాటు చేశార‌న్నారు. పాఠ్యప్రణాళిక నుండి ఎమర్జెన్సీని వెంటనే తొలగించాల‌ని సంజ‌య్ రౌత్ డిమాండ్ చేశారు.

  • Related Posts

    ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

    Spread the love

    Spread the loveనియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్…

    ఆర్డీఎస్ కు నీళ్లు అంద‌డం లేదు : సీఎం

    Spread the love

    Spread the loveపంచాయ‌తీలు వ‌ద్దు ప‌రిష్కార‌మే ముద్దు క‌ర్ణాట‌క : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటాన‌ని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *