కేంద్రాన్ని హెచ్చరించిన జోసెఫ్ విజయ్
చెన్నై : కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. లీకులకు కేరాఫ్ గా మారిన కేంద్ర విద్యా రంగం పై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నీట్ యుజి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సీఎం. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం , పరీక్షా పత్రాలు లీక్ కావడం వంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష పెద్ద వివాదాస్పద అంశంగా మారిందన్నారు. అందుకే దానిని పూర్తిగా బ్యాన్ చేయాలన్నారు. దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయించాలని కోరుతున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రంలో గతంలో హింసాత్మక నిరసనలకు దారితీసిన ‘హిందీ భాషా రుద్దకం’ అనే సున్నితమైన అంశంపై స్పందించారు సీఎం.
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ద్విభాషా విధానంస పూర్తిగా సరిపోతుందని నొక్కి చెప్పారు. తమిళం రాష్ట్ర భాషగా ఉండాలని, విస్తృత సమాచార మార్పిడి కోసం ఆంగ్లాన్ని ప్రపంచ భాషగా ఉపయోగించు కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ప్రసంగించాల్సి ఉన్న ఎన్నికల సభలో జరిగిన దురదృష్టకరమైన ‘కరూర్ తొక్కిసలాట’ ఘటన గురించి కూడా విజయ్ ప్రస్తావించారు; 41 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఆ ఘటన పట్ల తనకు కలిగిన బాధను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. ఆ ఘటనకు తనను బాధ్యుడిని చేయడానికి ప్రయత్నించిన రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజకీయాలు ఇంతటి నీచ స్థాయికి దిగజారాయా అని ప్రశ్నించారు.






