విడుదల చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు (Spouse Pensions) జూలై 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ. 3.12 కోట్లను విడుదల చేసినట్టు కూడా మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకుని రూ. 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి తెలిపారు.





