న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

Spread the love

మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌ట‌న

న‌ల్ల‌గొండ జిల్లా : రాబోయే రోజుల్లో న‌ల్ల‌గొండ‌ను అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది ప‌లికిన‌ట్ల‌యింద‌న్నారు. ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అభివృద్ధి బాటలు. ప్రతి గ్రామాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానం చేసి తెలంగాణను మరింత బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం అన్నారు మంత్రి.

ఒక కుటుంబ పెద్దలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో భరోసా నింపుతూనే, మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం. నల్గొండ బిడ్డగా నా గుండెను తొలిచే బాధ ఫ్లోరైడ్ సమస్య. దానికి శాశ్వత పరిష్కారం చూపే మన చిరకాల స్వప్నమైన ఎస్.ఎల్.బి.సి (SLBC) ప్రాజెక్టును వేగవంతం చేశాం. 2028 ఆగస్టు నాటికి సొరంగం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందించి ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తాం అన్నారు.

  • Related Posts

    నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌

    Spread the love

    Spread the love24 X 7 మాదిరి చెత్త తొల‌గించే ప‌నిలో హైడ్రా హైద‌రాబాద్ : న‌గ‌రంలో చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు మారింది ప‌రిస్థితి. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త…

    ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    Spread the love

    Spread the loveవిడుద‌ల చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *