లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

రావాల‌ని కోరిన అధ‌వ అర్జున‌, తిరుమాళ‌వ‌న్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జూలై 1న త‌న నేతృత్వంలో జ‌రిగే ఈ స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా టీవీకే పార్టీ అధికార ప్ర‌తినిధి, మంత్రి అధ‌వ అర్జున ప్ర‌తి పార్టీని పాల్గొనాల‌ని స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అర్జున వీసీకే ప్రెసిడెంట్, ఎంపీ తిరు తిరుమావ‌ళ‌న్ ను క‌లిశారు. రావాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు క‌లిసి టీవీకే మిత్రపక్షాల సమావేశానికి ‘లిబరేషన్ పాంథర్స్ పార్టీ’కి ఆహ్వానించారు.

ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతూ గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్, అలాగే ప్రజా పనులు , క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానాన్ని అందించడం విశేషం. ఇదిలా ఉండ‌గా టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకుని కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని విస్తు పోయేలా చేశారు టీవీకే పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. రేపు జ‌రిగే ఈ కీల‌క స‌మావేశం లో ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    మంత్రి ఆధ‌వ్ అర్జున్ పేరు చెప్పి టోక‌రా

    చెన్నై : టీవీకే మంత్రి ఆధవ్ అర్జునగా నటిస్తూ ఎమ్మెల్యే నుంచి రూ. 8 కోట్లు ఆశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించి, తమళగ వెట్రి కళగం (TVK) వెల్లూరు ఎమ్మెల్యే…

    టీవీకే డీలిమిటేష‌న్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే

    చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్‌కు AIADMK మద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాజకీయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *