వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకుంటున్నా
అమరావతి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణఙదల.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతాంగం పట్ల మా కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నాం అని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు .





