జై భీమ్ దర్శకుడితో సూర్య, లోహర్ మూవీ

నిర్మించనున్న కేజీఎఫ్ మూవీ నిర్మాతలు
చెన్నై : ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నారు కేజీఎఫ్ చిత్రం నిర్మాతలు.
భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘హొంబలే ఫిల్మ్స్’ (Hombale Films), ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి చిత్రాలను అందించిన సంస్థగా పేరు పొందింది. విజయ్ కిరగందూర్ నిర్మాణంలో, ప్రముఖ నటుడు సూర్య, నటి కాయదు లోహర్ , ప్రఖ్యాత దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కలయికలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. బలమైన కథాంశం, అద్భుతమైన సినిమాటిక్ విజన్తో కూడిన ఈ చిత్రం, ప్రేక్షకులను అలరించనుంది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులు (సౌత్) గెలుచుకున్న నటుడు సూర్య, వాణిజ్యపరమైన విజయాలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందే నటనను సమతుల్యం చేసుకుంటూ రానున్నారు.
అర్థవంతమైన సినిమాలను నిర్మించే నిర్మాతగానూ గుర్తింపు పొందారు. వీరితో పాటు దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. బలమైన కథనం, భావోద్వేగ లోతు , సామాజిక ప్రాముఖ్యత కలిగిన ‘జై భీమ్’ చిత్రంతో ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ తాజా సహకారం గురించి హొంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, “ఒకే లక్ష్యంతో కూడిన విజన్తో అంకితభావం కలిగిన వ్యక్తులు కలిసి పనిచేసినప్పుడు శక్తివంతమైన సినిమాలు రూపు దిద్దుకుంటాయని హొంబలే ఫిల్మ్స్ బలంగా నమ్ముతుంది. సూర్య, టి.జె. జ్ఞానవేల్లతో కలిసి పనిచేయడం అనేది నిజాయితీతో కూడిన, అర్థవంతమైన , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యే కథను చెప్పే దిశగా ఒక అడుగు,” అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రఫీ, కె. కతిర్ ప్రొడక్షన్ డిజైన్ , ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.