అన్న‌దాత‌ల‌కు రూ. 324.22 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

ద‌శ‌ల వారీగా మిగ‌తా నిధులు జ‌మ చేస్తామ‌న్న స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడంలో విఫలమైన జగన్, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంద‌న్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న ప్రచారం పూర్తిగా నిరాధారం అన్నారు. 2024-25 పంట నష్టాలకు సంబంధించి రూ.580.76 కోట్లలో ఇప్పటికే రూ.324.22 కోట్లు విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం అని వెల్ల‌డించారు. 2025-26 పంట నష్టాలకు రూ.266.414 కోట్లు, 2023 తుఫాన్ ప్రభావిత రైతులకు అదనంగా రూ.48 కోట్లు మంజూరు చేశామ‌ని తెలిపారు.

వైసీపీ హయాంలో జరిగిన లోటును భర్తీ చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసే ముందు, తన ఐదేళ్ల పాలనలో రైతులకు చేసిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14,000, కేంద్ర సాయం 6000తో కలిపి ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తోంద‌ని చెప్పారు. కానీ జగన్ రైతు భరోసా పేరుతో 2019 ఎన్నికల్లో కేంద్ర సాయం లేకుండానే రూ.13,500 ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు కేంద్రం ఇచ్చిన రూ.6,000 కలిపి మాత్రమే రూ.13,500 చెల్లించారని ఆరోపించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసిన చరిత్ర జగన్‌దేన‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *