గుడిపాటికి ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రతి ఏటా మహాకవి దాశరథి పురస్కారం అంద‌చేస్తూ వ‌స్తోంది. ఈసారి కూడా ఈ ఏడాది సీనియర్ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు గుడిపాటిని ఎంపిక చేసింది. ఈనెల 22వ తేదీ దాశరథి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందని తెలిపింది స‌ర్కార్. దాశరథి పురస్కారం కింద జ్ఞాపిక, ప్రశంసా పత్రం, లక్షా వెయ్యి నూట పదహార్లు నగదుతో సత్కరిస్తారు. ఈ అవార్డు ఎంపిక కోసం ప్రతి ఏడాది ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి రచయిత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.

ఇందులో రచయిత డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవి జయరాజు, కవి డా. యాకూబ్, కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి సభ్యులుగా వున్నారు. గుడిపాటి వెంకటేశ్వర్లు పూర్తి పేరు అయినప్పటికీ గుడిపాటిగా సాహిత్య రంగంలో గుర్తింపు పొందారు. వార్త సండే డెస్క్ ఇంచార్జ్ గా చాలా కాలం పని చేశారు. ఎంత సౌమ్యంగా వుంటారో ఆయన రాతలు అంతగా సూటిగా లోతైన విశ్లేషణలతో ఉంటాయి. ఎక్కడా రాజీపడని రచనలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. ఎన్నో ఏళ్లుగా సాహిత్యంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పుర‌స్కారాన్ని ఎంపిక చేసిన‌ట్లు ఎంపిక క‌మిటి వెల్ల‌డించింది.

  • Related Posts

    సీఎంను క‌లిసిన యూఏఈ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్

    అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మ‌ర్యాద పూర్వ‌కంగా మంగ‌ళ‌వారం క‌లిశారు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు చెందిన ఆర్థిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి . ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి…

    సోష‌ల్ మీడియాలో అసత్య ప్ర‌చారంపై ఫోక‌స్ పెట్టాలి

    విజ‌య‌వాడ : సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *