అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు

హైద‌రాబాద్ : భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి హైద‌రాబాద్ న‌గ‌రంలో. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా DRF, MRT బృందాల సేవలు నిమ‌గ్నం అయ్యాయి. రహదారుల్లో నిలిచిన వరద నీటిని సాఫీగా పంపుతోంది హైడ్రా. వర్షం ప్రభావాన్ని, క్షేత్ర స్థాయిలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు సూచ‌న‌లు చేశారు.క్షేత్ర స్థాయిలో హైడ్రా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Heavy మోటార్లను పెట్టి నీటిని తోడి వేశారు. ఇందులో కీల‌క పాత్ర పోషించింది హైడ్రా. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకొని సూచనలు చేశారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య .

ఆర్ఎఫ్ఓ జ‌య‌ప్ర‌కాష్‌, డీఎఫ్ఓ శ్రీ‌ధ‌ర్, డీఎఫ్ఓ గౌతం, హైడ్రా ఎస్ఎఫ్ఓ లంతా క్షేత్ర స్థాయిలో ఉండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించారు. వెనువెంటనే సహాయక చర్యలతో నార్మల్ పరిస్థితులుండేలా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. మ‌రో వైపు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నిన్న రాత్రి హుటా హుటిన హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ ఉండాల‌ని ఆదేశించారు క‌మిష‌న‌ర్. కురుస్తున్న వ‌ర్షాల‌కు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాటిని తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    వైసీపీలోకి విజ‌య సాయి రెడ్డి రానున్నారా..?

    తాడేప‌ల్లి గూడెం : వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కొంత కాలం పాటు దూరంగా ఉంటూ వ‌చ్చారు మాజీ ఎంపీ , కింగ్ పిన్ గా పేరు పొందిన విజ‌య సాయి రెడ్డి. తాను పార్టీతో ట‌చ్ లో లేడు. ఈ…

    రెఫ‌ర‌ల్ ఆస్ప‌త్రిగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

    హైద‌రాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ‘రెఫరల్ కేంద్రం’గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్ర‌క‌టించారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇక్కడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *