ఫ్యూచర్స్ ట్రేడింగ్లో పెరిగిన బంగారం, వెండి ధర
హైదరాబాద్ : ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బంగారం ధర రూ. 1,029, వెండి ధర రూ. 1,862 పెరిగాయి . కొత్తగా తీసుకున్న పొజిషన్లు , స్పాట్ మార్కెట్లో బలమైన డిమాండ్ కారణంగా విలువైన లోహాల ధరలు పెరిగాయి. గురువారం జరిగిన ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,029 పెరిగి రూ. 1,53,431కి చేరగా, వెండి ధర కిలోకు రూ. 1,862 పెరిగి రూ. 2,38,128కి చేరింది. స్పెక్యులేటర్లు కొత్తగా పొజిషన్లు తీసుకోవడం, స్పాట్ మార్కెట్లో డిమాండ్ బలంగా ఉండటంతో ఈ పెరుగుదల నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, అక్టోబర్ డెలివరీకి సంబంధించిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,029 (అంటే 0.68 శాతం) పెరిగి రూ. 1,53,431కి చేరింది.
ఈ కాంట్రాక్ట్ ద్వారా 2,467 లాట్ల వ్యాపార టర్నోవర్ నమోదైంది. మార్కెట్ పాల్గొనేవారు కొత్తగా పొజిషన్లు తీసుకోవడం వల్లే ఈ పెరుగుదల కనిపించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, న్యూయార్క్ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 0.89 శాతం తగ్గి ఔన్స్కు 4,420.49 డాలర్లకు పడిపోయింది. వెండి ధరలు కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్లో పెరిగాయి.. MCXలో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన వెండి ధర కిలోకు రూ. 1,862 (అంటే 0.79 శాతం) పెరిగి రూ. 2,38,128కి చేరింది. వెండి కాంట్రాక్ట్ 2,445 లాట్ల వ్యాపార టర్నోవర్ను నమోదు చేసింది. మార్కెట్ పాల్గొనే వారు కొత్తగా పొజిషన్లు తీసుకోవడం వెండి ధరల పెరుగుదలకు దోహద పడిందని విశ్లేషకులు తెలిపారు. విదేశీ మార్కెట్లో, వెండి ఫ్యూచర్స్ ధర 1.04 శాతం పెరిగి ఔన్స్కు 65.99 డాలర్లకు చేరింది.