దుబాయ్ : పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెకు జరిమానా విధించారు. మహిళల ఆసియా కప్ మ్యాచ్లో ICC ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్తో జరిగిన మహిళల ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్లో (ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది), ICC ప్రవర్తనా నియమావళిలోని ‘లెవల్ 1’ నిబంధనను ఉల్లంఘించినందుకు ఫాతిమా సనాపై ఈ చర్య తీసుకున్నారు. అంతర్జాతీయ మ్యాచ్లో బ్యాటర్ అవుట్ అయినప్పుడు వారిని కించపరిచేలా లేదా వారిలో దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే భాష, చర్యలు లేదా సైగలను ఉపయోగించడం అనే అంశానికి సంబంధించిన ICC ‘ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్’ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు తేలిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్ 56 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ షఫాలీ వర్మను ‘కాట్ అండ్ బౌల్డ్’ పద్ధతిలో అవుట్ చేసిన తర్వాత ఫాతిమా పెవిలియన్ వైపు సైగ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 24 నెలల వ్యవధిలో ఫాతిమా చేసిన రెండవ ఉల్లంఘన ఇది, దీనితో ఆమె ఖాతాలో మొత్తం డీ మెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. ఆమెకు గతంలో డబ్లిన్లో ఐర్లాండ్తో జరిగిన ప్రారంభ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. సనా ఫాతిమా తన తప్పును అంగీకరించారు. ఎమిరేట్స్ ICC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన సుప్రియ రాణి దాస్ ప్రతిపాదించిన శిక్షను స్వీకరించారు, కాబట్టి దీనిపై అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది అని ICC పేర్కొంది.







