newsseals.com

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వ‌హించాలి

September 12, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఈ నెల 17న జరగనున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్; ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చోంగ్తు, శిఖా గోయల్; హైదరాబాద్ సీపీ సజ్జనార్; ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి; సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు ప్రధాన కార్యదర్శి . ప్రజా పాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్‌లో జరుగుతుందని తెలిపారు. 17వ తేదీ ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకుంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం అమరవీరుల స్తూపం , పబ్లిక్ గార్డెన్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాలంకరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ‘ఫుల్-డ్రెస్ రిహార్సల్స్’ (పూర్తి స్థాయి రిహార్సల్స్)ను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజా పాలన దినోత్సవానికి 1,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో సహా మొత్తం 2,000 మంది హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

Related News