సోలమన్ పప్పయ్యకు రజనీ, విజయ్ నివాళి
చెన్నై : తమిళ మేధావి, ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య మృతి చెందారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు రజనీకాంత్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ . ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తమిళ మహవాణి, ఎప్పటికీ చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. సాహిత్య రంగాన్ని విద్యావంతుల స్థాయి నుండి సామాన్యుల స్థాయికి ప్రజాదరణ పొందిన రీతిలో తీసుకు వెళ్ళిన గొప్ప తమిళ మేధావి, ప్రొఫెసర్ సోలమన్ పప్పయ్య ఆత్మకు శాంతి చేకూరాలని నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు రజనీకాంత్. తమిళ నాటకరంగ స్వర్ణయుగం ముగిసిందన్నారు నటుడు విజయ్ సేతుపతి. తమిళాన్ని సరళంగా, సుందరంగా అర్థమయ్యేలా ఇంటింటికీ తీసుకు వెళ్ళిన సోలమన్ పప్పయ్య మరణం తమిళ భాషకు, తమిళ ప్రజలకు తీరని లోటు. ఆయన మాటలు నేరుగా తమిళంలో జీవిస్తాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అన్నారు.
నా చిన్నతనం నుండి మీ గొంతు లేకుండా ఒక్క పండుగ కూడా జరగలేదు. నా కళాశాల రోజుల్లో, మీ గొంతు తోడుగా లేకుండా నేను ఎప్పుడూ వేదికపైకి అడుగు పెట్టలేదు. సర్, నేను వేదికపై మీ గొంతును, మీ ప్రత్యేకమైన ‘ప్రియమైన పెద్దలారా’ అనే ప్రారంభ వాక్యాన్ని అనుకరిస్తూ మాట్లాడినప్పుడల్లా చప్పట్లతో మారుమోగే తమిళ సమాజంలో, మీ మాటల ద్వారా , తమిళ భాష ద్వారా మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి పోతారని స్మరించుకున్నారు నటుడు శివ కార్తికేయన్ . తమిళ గొప్ప స్వరం, ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు నటుడు, డ్యాన్సర్ ప్రభు దేవా.