గ‌ణేశ్ ఉత్స‌వాలకు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి

అమరావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి వినాయ‌క మండపాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీల‌తో హోం శాఖ మంత్రి టెలి కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. వివిధ అంశాలపై ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్సవాలకు అనుమతుల జారీపై ఎస్పీలతో చర్చించారు. అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు అనిత వంగ‌ల‌పూడి.

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్ మండపాలు, ఊరేగింపుల విషయంలో నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన శాంతిభద్రతల సమీక్షపై ఎస్పీలతో చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండ కూడదని ఎస్పీలకు స్పష్టం చేశారు హోం మంత్రి అని వంగ‌ల‌పూడి.

  • Related Posts

    వ‌రుస సెల‌వులు శ్రీ‌శైలంలో పోటెత్తిన భ‌క్తులు

    నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం దేవాల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో ఆల‌యంలో కొలువు తీరిన శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించ‌డం ఒకానొక…

    సీఎం చంద్ర‌బాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌తో పాటు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ బోర్డు స‌భ్యులు , ఆల‌య అర్చ‌కులు శ‌నివారం అమ‌రావ‌తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *