ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా ఆడేవారు లేదా చూసేవారని పేర్కొన్నారు. ఆయ‌న చిట్ చాట్ సంద‌ర్భంగా ఇండియాలో కొన‌సాగుతున్న ఐపీఎల్, ఇత‌ర టోర్నీల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తాజాగా ల‌లిత్ మోడీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి క్రికెట్ వ‌ర్గాల‌లో.

అందుకే ఐపీఎల్‌కు ఆ సమయం దొరికిందన్నారు. కానీ ఈ రోజు ఐపీఎల్ బీసీసీఐకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారింద‌న్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో అది అత్యుత్తమ విండోను ఎందుకు తీసుకోకూడదు? అని ప్ర‌శ్నించారు ల‌లిత్ మోడీ. ప్రతి లీగ్ తనకంటూ ఒక విండోను సృష్టించుకుందని చెప్పారు. బీబీఎల్, ది హండ్రెడ్, ఈపీఎల్, సీపీఎల్, ఎస్ఏ20, చివరికి యూఎస్ఏ కూడా ఈ ఫార్మాట్ ను కొన‌సాగిస్తోంద‌ని తెలిపారు. ఐపీఎల్ కూడా అదే పని ఎందుకు చేయకూడదని అన్నారు ల‌లిత్ మోడీ. డబ్బు ఇక్కడే ఉంది కాబట్టి ఆటగాళ్లు వస్తారు. ప్రతి ఒక్కరినీ వారి వారి విండోలో ఆడనివ్వాల‌ని సూచించారు. ఐపీఎల్‌ను సాధ్యమైనంత ఉత్తమమైన సమయంలో షెడ్యూల్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే క్రీడా సంస్థ ఏర్పాటు

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : భ‌విష్య‌త్ త‌రాల కోస‌మే విశాఖ‌ప‌ట్నంలో పీవీ సింధు పేరుతో అకాడమీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అడ్వైజ‌ర్ రాజీనామా

    అమెరికా : ఇన్‌ఫాంటినో ప్రైవేట్ ఈక్విటీ ప్రణాళికకు నిరసనగా వైట్ హౌస్ వరల్డ్ కప్ ప్యానెల్‌లోని ఫిఫా సలహాదారు కార్లోస్ కోర్డెరో శుక్ర‌వారం రాజీనామా చేశారు. వరల్డ్ కప్‌లో వాటాను విక్రయించాలని ఫిఫా భావిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *