
ట్రంప్ ప్రయత్నం అభినందనీయం
ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్నందున అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని. బందీల విడుదల సంకేతాలను ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. భారతదేశం శాశ్వత శాంతి కోసం అన్ని ప్రయత్నాలను గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో సంక్షోభాన్ని అంతం చేయడంలో మద్దతు ఇచ్చినందుకు ప్రపంచ నాయకులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు .
బందీలను స్వదేశానికి తిరిగి రావాలని తాను ఎదురు చూస్తున్నానని అన్నారు . దురదృష్టవశాత్తు, వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు, వారి తల్లిదండ్రుల మాదిరిగానే తాను కూడా ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాకు అపారమైన సహాయం అందించబడింది. ఈ యుద్ధం ముగియాలని, మధ్యప్రాచ్యంలో శాంతిని చూడాలని అందరూ ఏకమయ్యారు . మేము దానిని సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నామని స్పష్టం చేశారు ట్రంప్. హమాస్ జారీ చేసిన ప్రకటన ఆధారంగా, వారు శాశ్వత శాంతికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడిని ఆపాలి, తద్వారా మనం బందీలను సురక్షితంగా , త్వరగా బయటకు తీసుకు వచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు ట్రంప్.