ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

నిజామాబాద్‌ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు. వాహ‌నం చోరీ చేస్తున్న స‌మ‌యంలో ప‌ట్టుకోబోయిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ పై నిందితుడు షేక్ రియాజ్ దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో త‌ను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇవాళ పోలీసులు త‌నను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా మ‌రోసారి క‌త్తితో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఎన్ కౌంట‌ర్ లో రియాజ్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కీల‌క అప్ డేట్ ఇచ్చాడు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి.

ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ కు పోలీస్ శాఖ త‌ర‌పున ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నామ‌ని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచి వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు డీజీపీ. ప్రమోద్‌ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామ‌న్నారు. ప్రమోద్‌ పదవీ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామ‌న్నారు . 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామ‌న్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని రేపు జ‌రిగే అమ‌ర వీరుల స‌భ‌లో సీఎం ప్ర‌క‌టిస్తార‌ని చెప్పారు డీజీపీ.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *