ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించాన‌ని చెప్పారు సీఎం. ఈ రోజు ఫలితాలు చూస్తుంటే, ప్రజల స్పందన చూస్తుంటే వాళ్ల ఆరోపణలే నాకు ఆశీర్వాదాలుగా మారాయని అనిపోస్తోంద‌ని చెప్పారు.

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇళ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. వరదలు వచ్చినపుడు పేదలు ముంపు బాధితులుగా మిగల కూడదు అనేది మా తపన అన్నారు సీఎం. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి నా సూచన. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రకృతి పునరుద్ధరణ కు సహకరించాలని కోరారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం అన్నారు. పిల్లల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Related Posts

ప్రాసిక్యూషన్‌కు ఫోరెన్సిక్ సైన్స్ వెన్నెముక : డీజీపి

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు చార్జిషీట్‌లకు వెన్నెముకగా ఉంటాయని పేర్కొన్నారు. విచారణ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. సాక్ష్యాలను సరిగ్గా సేకరించి, విశ్లేషించి, కోర్టులో సమర్పించక పోతే, క్షుణ్ణంగా పోలీసులు పని…

హైడ్రాపై హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి చెంప‌పెట్టు

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిద‌న్నారు. హిట్లర్ వారసుడినని చెప్పుకునే రేవంత్ రెడ్డికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *