పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవ‌లం వ‌సూళ్ల కోసం, బెదిరించేందుకు హైడ్రాను తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. పేద‌ల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌న్నారు కేటీఆర్. ఆయ‌న బాధితులకు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు . దీపావ‌ళి పండుగ‌ను ఇక్క‌డ జ‌రుపుకున్నారు. ఉండటానికి ఇల్లు లేక, కిరాయి కట్టడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిరుపేదల కడుపు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఏం సహాయం చేయలేదని, అందుకే నిలువునీడ లేకుండా పోయిన నిరుపేదలతో కలిసి దీపావళి జరుపాలని నిర్ణయించు కున్నానని తెలిపారు. తాము వచ్చి హైడ్రా బాధితులతో కలిసి దీపావళి జరుపుకుంటే నైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుపేదలకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చామని, బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకొని, సహాయం చేయడానికి వచ్చామని స్పష్టం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి హైడ్రా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *