త‌మ్మ‌డికుంట చెరువును కాపాడిన‌ హైడ్రాకు థ్యాంక్స్

ధ‌న్య‌వాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్ర‌ద‌ర్శ‌న

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను కాపాడే ప‌నిలో ప‌డింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ సంద‌ర్బంగా స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేప‌ట్టారు. ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వహించారు.

రోడ్డులు, పార్కుల ఆక్రమణలను తొలగించిందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అల్మాస్ గూడ బోయపల్లి ఎన్ క్లెవ్ కాలనీలో లేఔట్ ప్రకారం ఉన్న రోడ్లు, పార్కులను హైడ్రా కాపాడిందంటూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా హైడ్రాకు, స‌ర్కార్ కు కృత‌జ‌త‌లు తెలియ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని అభినందించారు. పూర్తి స్థాయి లో కాలనీ అభివృద్ధికి కృషి చేయాల‌ని, కాలనీ పార్క్ ను అభివృద్ధి చేయాలని, రోడ్లు బాగు చేయాలని కోరారు. హుస్సేనీ ఆలయంలో ఫాతిమా కాలనీలో కూడా హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *