డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

స్ప‌ష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్

బీహార్ : డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆయ‌న బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వానికి మ‌రోసారి ప‌ట్టం కట్టాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో , రాష్ట్రంలో స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్నారు. ఓ వైపు నితీష్ కుమార్ ఇంకో వైపు మోదీ ఇద్ద‌రూ రాజ‌కీయ ప‌రంగా అనుభ‌వం క‌లిగిన వార‌న్నారు. ఇప్ప‌టికే 12 సార్లు ఇక్క‌డికి వచ్చి వెళ్లార‌ని చెప్పారు నారా లోకేష్‌.

ఆయ‌న అంత‌కు ముందు బీహార్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా స‌మ‌ర్థుడైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఏపీ అన్ని రంగాల‌లో ప‌రుగులు తీస్తోంద‌ని చెప్పారు. దేశంలోనే ఏపీని నెంబ‌ర్ వ‌న్ గా చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్ హ‌బ్ గా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు నారా లోకేష్. ఇటీవ‌లే ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ ఐటీ సంస్థ గూగుల్ త‌న ఏఐ హ‌బ్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *