రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

Spread the love

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న నాబార్డ్ ను ఈ సంద‌ర్బంగా ప్ర‌శంసించారు. హైద‌రాబాద్ లో నాబార్డ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఎర్త్ స‌మ్మిట్ 2025లో ఆయ‌న పాల్గొని ప్రసంగించారు. రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ప్ప‌టికీ మ‌రింత‌గా స‌పోర్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా రుణాలు ఇచ్చేట‌ప్పుడు స‌బ్సిడీ కూడా ఎక్కువ‌గా ఇచ్చిన‌ట్ల‌యితే మ‌రింత సాగు చేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు దృష్టి సారించేందుకు వీలు కుదురుతుంద‌న్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

మన రైతులు, మన నేల, మన గ్రామీణ సమాజాలు భారతదేశ బలానికి గుండెకాయగా నిలిచాయని చెప్పారు. బలమైన సంస్థలు నిజమైన వ్యవసాయ పరివర్తనకు దారితీస్తాయనితాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు డిప్యూటీ సీఎం. ఆ ప్రయాణంలో నాబార్డ్ అత్యంత ప్రభావవంతమైన భాగస్వాములలో ఒకటిగా ఉంద‌న్నారు. తెలంగాణలో రుణమాఫీలు, పారదర్శక సేకరణ, డిజిటల్ పంట వ్యవస్థలు, గ్రామీణ కనెక్టివిటీ మరియు వాతావరణ-స్మార్ట్ వ్యవసాయంతో రైతులను శక్తివంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్ర‌క‌టించారు . ఆధునిక, సాంకేతికత ఆధారిత, స్థితిస్థాపక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి నాబార్డ్ తో క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు.

  • Related Posts

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

    Spread the love

    Spread the loveఇళ్ళలోకి చొచ్చుకొచ్చి నానా బీభత్సం రాజ‌స్థాన్ : ఇసుక తుపాను దెబ్బ‌కు రాజస్థాన్ విల విల లాడింది. రాజ‌స్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *