స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

Spread the love

తెలంగాణ స‌ర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల‌కు స‌న్న బియ్యం పంపిణీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి తెలియ చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. దేశ వ్యాప్తంగా పేద‌ల‌కు ఆయా రాష్ట్రాల‌లో ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడాల‌ని కోరారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీల‌క‌మైన సూచ‌న‌కు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి. మంచి ప‌థ‌క‌మ‌ని, దీని వ‌ల్ల పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే తాను ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతాన‌ని, ఢిల్లీలో ఇందుకు సంబంధించి కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి సాధ్యా సాధ్యాల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

  • Related Posts

    కేర‌ళ‌ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ రెడ్డికి లేదు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కేర‌ళ : త‌న‌తో పాటు కేర‌ళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్. ఇటీవ‌ల కేరళ…

    నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్ 69 మందిపై వేటు

    Spread the love

    Spread the loveఏపీఎస్పీడీసీఎల్ లో న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల బాగోతం అమ‌రావ‌తి : ఏపీఎస్పీడీసీఎల్ లో న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో జాబ్స్ పొందిన వారిపై వేటు వేయ‌డం క‌ల‌క‌లం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ ధ్రువపత్రాలతో య‌ధేశ్చ‌గా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందారు. ఆపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *