నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

Spread the love

మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. లేఖ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌కు , నా కుటుంబానికి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వేడుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్ మృతిని నాపై రుద్దే ప్రయత్నం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు 50వేల మెజారిటీ వచ్చేదన్నారు. మెజార్టీ రాకుండా అడ్డుకున్నది కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న కోవర్టులేన‌ని ఆర‌పించారు బోర‌బండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్. ఇదిలా ఉండ‌గా తాజాగా మాజీ డిప్యూటీ మేయ‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో. దీనిపై ఇంకా ఎలాంటి విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు స‌ర్కార్. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు ఫ‌సియోద్దీన్.

  • Related Posts

    పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

    Spread the love

    Spread the loveఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్ర‌క‌ట‌న తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన…

    రాజధాని నిర్మాణం చేతకాకే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *