కేసీఆర్ వ‌ల్లే కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు

ఏర్పాటైంద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వ‌రంగ‌ల్ జిల్లా : కేసీఆర్ వ‌ల్ల‌నే వ‌రంగ‌ల్ జిల్లాలో కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయింద‌ని, కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, బాధ పడేది లేదు భయపడేది అంత కన్నా లేదన్నారు. పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఉద్యమంలో ఎలా ముందు ఉన్నారో ఇప్పుడు కూడా న్యాయవాదులు ముందు ఉంటున్నారని వారికి ధన్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించడం జ‌రిగింద‌ని చెప్పారు.

ఆజామ్ జాహి మిల్లు మూతపడి బతుకు దెరువు కోసం వెళ్ళిన వాళ్ళు వరంగల్ కు రావాలని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించారని గుర్తు చేశారు. కంపెనీలు రావ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌న్నారు. బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తామంటూ మాయ మాట‌లు చెప్పార‌ని, చివ‌ర‌కు బీసీల‌ను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఐదు రకాలుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చుపెట్టారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *