కార్మికుల‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

Spread the love

నిప్పులు చెరిగిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు, కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశల పై ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికే ఆమోదం తెలిపిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కార్మికులంతా కోరుకున్న‌ట్లు ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

లేక‌పోతే ప్ర‌జా పోరాటాల ద్వారా బుద్ది చెప్పి తీరుతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో బీసీల‌ను న‌ట్టేట ముంచింద‌న్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి మోసం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చాడ‌ని మండిప‌డ్డారు. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత మాత్రం దానికి రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి, కులగణన సర్వే చేసి, రాహుల్ రేవంత్ మోడల్ అని బిల్డప్ కొట్టడం దేనికి అంటూ ప్ర‌శ్నించారు. ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెపుతార‌ని అన్నారు.

  • Related Posts

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    Spread the love

    Spread the loveఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    Spread the love

    Spread the loveనిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *