తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

Spread the love

పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంక‌ర్ గౌడ్

హైద‌రాబాద్ : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెలంగాణ‌లో జ‌నసేన పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు నేమూరీ శంక‌ర్ గౌడ్. హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి 10 జిల్లాల పార్టీ శ్రేణులు, గ్రేటర్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి పది జిల్లాల్లోని ఇన్చార్జిలు, వివిధ పదవులలో ఉన్న నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ లోని నియోజకవర్గ ఇంచార్జిలు, నాయకులు, వీర మహిళలు, జన సైనికులు హాజ‌ర‌య్యారు.
ఈ సంద‌ర్బంగా పార్టీ బ‌లోపేతంపై నేత‌లు, బాధ్యులు ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని పిలుపునిచ్చారు నేమూరీ శంక‌ర్ గౌడ్. కింది స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు జ‌న‌సేన ముందుకు క‌ద‌లాల‌ని అన్నారు.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ర్కార్ దృష్టికి తీసుకు వెళ్లాల‌ని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం, పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కె సాగర్ , కూకట్పల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , బి.విజయ్ , వీర మహిళల విభాగం చైర్మన్ మండపాక కావ్య , వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరు శిరీష‌, స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డ పాల్గొన్నారు.

  • Related Posts

    రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : జ‌గిత్యాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ మార‌డం ప‌క్కా అని అన్నారు.…

    ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

    Spread the love

    Spread the loveఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *