పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాలి

మంత్రి వంగ‌ల‌పూడి అనిత కామెంట్స్

గుంటూరు జిల్లా : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగుతున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. పలు అంశాలపై చర్చించారు.. పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ కావాల‌ని కోరారు. ఒక్కో కార్య‌క‌ర్త కొత్త‌గా మ‌రో 100 మందిని పార్టీలో చేర్చేలా కృషి చేయాల‌ని కోరారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా కూట‌మి స‌ర్కార్ అనేక సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌ని చెప్పారు. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్య‌త పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు వంగ‌ల‌పూడి అనిత‌. అంతే కాకుండా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల గురించి కూడా తెలియ చేయాల‌ని సూచించారు. పార్టీ కేడ‌ర్ అంతా 24 గంట‌ల పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి సోమ‌వారం టీడీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా ద‌ర్బార్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్న‌ట్లు తెలిపారు. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు వంగ‌ల‌పూడి అనిత‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *