కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

Spread the love

అందించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు

న్యూఢిల్లీ : ఏపీని ఇటీవ‌ల మొంథా తుపాను అత‌లాకుత‌లం చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక‌ను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగ‌ల‌పూడి , కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ల‌తో క‌లిసి కేంద్ర వ్య‌వసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మొంథా తుపాను కార‌ణంగా వాటిల్లిన న‌ష్టాన్ని వివ‌రించారు. త‌క్ష‌ణ‌మే నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కోరారు.

రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాను ప్రభావంతో నష్ట పోయాయని తెలిపారు. దీని కార‌ణంగా సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని వివ‌రించారు. సుమారు 6,250 హెక్టార్లలో పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై కేంద్రం నుంచి త‌క్ష‌ణ‌మే సాయం అందించి ఆదుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితిలో ఉంద‌ని తెలిపారు.

  • Related Posts

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది

    Spread the love

    Spread the loveగెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం అమరావతి : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

    పుట్టప‌ర్తిలో యుద్ద విమానాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌

    Spread the love

    Spread the loveసీఎం చంద్రబాబుకు స‌విత ధన్యవాదాలు శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా : ఏపీ మంత్రి స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు తెలిపారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *