కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

అందించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు

న్యూఢిల్లీ : ఏపీని ఇటీవ‌ల మొంథా తుపాను అత‌లాకుత‌లం చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక‌ను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగ‌ల‌పూడి , కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ల‌తో క‌లిసి కేంద్ర వ్య‌వసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మొంథా తుపాను కార‌ణంగా వాటిల్లిన న‌ష్టాన్ని వివ‌రించారు. త‌క్ష‌ణ‌మే నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కోరారు.

రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాను ప్రభావంతో నష్ట పోయాయని తెలిపారు. దీని కార‌ణంగా సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని వివ‌రించారు. సుమారు 6,250 హెక్టార్లలో పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై కేంద్రం నుంచి త‌క్ష‌ణ‌మే సాయం అందించి ఆదుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి జ‌గ‌న్ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ద‌య‌నీయ‌మైన ప‌రిస్థితిలో ఉంద‌ని తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *