ధ‌న‌వంతుల కోస‌మే ఆప‌రేష‌న్ ఖ‌గార్

కేంద్ర స‌ర్కార్ పై ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్

హైద‌రాబాద్ : కేవ‌లం బ‌డా బాబుల‌కు, ధ‌న‌వంతుల‌కు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోస‌మే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఖ‌గార్ చేప‌ట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భార‌త రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న‌ది హింస కాదా అని ప్ర‌శ్నించారు. మావోయిస్టులు వారి కోసం పోరాడ‌టం లేద‌ని, ఆదివాసీల హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌శ్నించ‌డం నేర‌మ‌ని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

బీజేపీ అభివృద్ధిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు, మీకు ఎదురు తిరిగిన వారు అందరూ నక్సలైట్స్ అవుతారా అని నిల‌దీశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను. కేవలం ఖనిజ వనరులను తవ్వుకొని ధనికులను మరింత ధనవంతులుగా మార్చేందుకు ఆపరేషన్ ఖగార్ మొదలు పెట్టారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇలాంటి ఆప‌రేష‌న్ల వ‌ల్ల ఉద్య‌మాలు, పోరాటాలు ఆగ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని కేంద్రం గుర్తిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *