
ఇస్కాన్ ను హెచ్చరించిన పూరి గజపతి
భువనేశ్వర్: పూరిలోని జగన్నాథుడి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తప్పక ఉంటాయని హెచ్చరించారు ప్రధాన ఆలయ పూజారి. తాజాగా ఆయన ఇస్కాన్ ను ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. దేవాలయాలు , సంకీర్తన ద్వారా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే రథయాత్ర, స్నాన యాత్ర వంటి ప్రధాన ఆచారాలను సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెప్పారు గజపతి మహారాజు దిబ్యాసింఘ దేబ్ .
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్)కి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు, నిర్దేశించిన ఆచారాలు, సమయాలకు వెలుపల రథయాత్ర, స్నాన యాత్ర ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శతాబ్దాల నాటి జగన్నాథుని ఆచారాలను సంస్థ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కాన్ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి సమాంతర ఉత్సవాలను నిర్వహిస్తోందని, తరచుగా ఈ వేడుకలను నియంత్రించే తిథిస్ (శుభ సమయాలు) , లేఖనాధారిత ఆదేశాలను విస్మరిస్తోందని వాపోయారు.
శ్రీల ప్రభుపాదుల కాలంలో 1977 వరకు ఇస్కాన్ చాలా వరకు సరైన ఆచారాలను అనుసరించిందని పేర్కొన్నారు .కానీ ఆయన మరణించిన తర్వాత సరైన సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నుండి 68 ప్రదేశాలలో పండుగను జరుపుకున్నారు, నిర్దేశించిన క్యాలెండర్ను పూర్తిగా విస్మరించారని గజపతి అన్నారు.