స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్ర‌శంస‌లు కురిపించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. బుధ‌వారం ఓయులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.
గ‌త పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారని, కానీ నేను ఏనాడూ గుంటూరులో చ‌దువు కోలేద‌న్నారు. త‌న‌కు గూడు పుఠానీ చేయ‌డం రాద‌న్నారు.

నాకు విదేశీ భాష రాక పోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చని అన్నారు రేవంత్ రెడ్డి.
పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు అని చెప్పారు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ముఖ్య‌ ఉద్దేశం అన్నారు. చేతనైతే ఆర్ట్స్ కాలేజీకి రమ్మని ఒకాయన గతంలో సవాల్ విసిరాడు . నాకేం ఫామ్ హౌసులు లేవు.. నేనేం ప్రజల సొమ్ము దోచుకోలేదని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాన‌ని, ఇవాళ మీతో ఇలా మాట్లాడుతున్నాన‌ని చెప్పారు సీఎం. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష అని స్ప‌ష్టం చేశారు. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు.జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం .పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు .బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం .
ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేశామ‌న్నారు. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం .విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుందని అన్నారు.

  • Related Posts

    అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

    Spread the love

    Spread the loveసంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం…

    దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకోం ఎదుర్కొంటాం

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ శ్రేణుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లుగా బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున రెండో విడ‌త జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దీంతో త‌ట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు దాడుల‌కు దిగ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *