ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం

వైద్య‌, విద్్యా రంగాల‌ను నిర్వీర్యం చేశారు

న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యుడు (ఎంపీ) మ‌ద్దెల గురుమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఏపీలో విద్య‌, వైద్య రంగాల‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు. వైసీపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆనాడు కొత్త‌గా 17 మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ రాష్ట్రంలో కొత్త‌గా కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌క పోవ‌డంతో దాదాపు 1000 సీట్ల‌ను కోల్పోవ‌డం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంపీ గురుమూర్తి.

ప్రైవేట్ యాజమాన్యాలు కేవలం లాభాపేక్షతో పనిచేస్తాయని, అదే జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో ప్రజలకు వైద్య సేవలు దూరమవుతాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలకు వెంటనే అనుమతులు మంజూరు చేసి, ఏపీలో ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేద కుటుంబాల‌కు, విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను దూరం చేసేందుకు ఏపీ స‌ర్కార్ కుట్ర‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ గురుమూర్తి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *