శ్రీ ర‌మ‌ణ దీక్షితులు ప్ర‌య‌త్నం అభినంద‌నీయం

ప్ర‌శంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని రచయిత శ్రీ రమణ దీక్షితులు పుస్తకంలో పొందుపరిచారు.

ఈ సంద‌ర్బంగా శ్రీ ర‌మ‌ణ దీక్షితులు చేసిన ప్ర‌య‌త్నాన్ని కొనియాడారు టీటీడీ చైర్మ‌న్. ఎన్నో ఏళ్లుగా క‌లియుగ దైవ‌మైన‌, కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగిన దేవ దేవుడు, శ్రీ క‌లియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో ప్ర‌ధాన అర్చ‌కులుగా విశిష్ట సేవ‌లు అందించార‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు ఈ ఆల‌యం ప‌ట్ల అపార‌మైన అవ‌గాహ‌న‌, అనుభ‌వం ఉంద‌న్నారు బీఆర్ నాయుడు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పుస్త‌కాలు రాయాల‌ని ఆకాంక్షించారు. నిత్యం తిరుమ‌ల‌ను సందర్శించే భ‌క్తుల‌కు ఇది మ‌రింత ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

    తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు.…

    బంగారం బ్యాగును భ‌క్తుడికి అప్ప‌గించిన టీటీడీ

    తిరుప‌తి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *