ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు

Spread the love

స్ప‌ష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
బెర్లిన్ : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌జాస్వామ్యం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం దేశంలో డెమోక్ర‌సీకి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. అత్యంత ప్ర‌మాదంలో ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే తాను భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాన‌ని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ వ్యవస్థ కాదని, అలా అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టేన‌ని చెప్పారు. ఇది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ అని పేర్కొన్నారు. బాధ్యతతో, జవాబుదారీతనంతో కూడిన ప్రక్రియ అని అర్థం చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.

శుక్ర‌వారం ఇండియ‌న్ కాంగ్రెస్ ఓవ‌ర్సీస్ ఆధ్వ‌ర్యంలో బెర్లిన్ లోని హెర్టీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో నాయకత్వం, ప్రజాస్వామ్యం, ప్రపంచ బాధ్యతపై కీల‌క వ్యాఖ్య‌లు, సూచ‌న‌లు చేశారు. విద్యార్థులు, పండితులు, విద్యావేత్తల ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన తన వ్యక్తిగత, రాజకీయ అనుభవాల నుండి సేకరించిన అంతర్దృష్టులను పంచుకున్నారు. అధికార పరివర్తనకు గురవుతున్న ప్రపంచం గురించి మాట్లాడారు, అదే సమయంలో భారత ప్రజాస్వామ్య స్థితిపై తన దృక్పథాలను కూడా అందించారు. సమ్మిళిత , సమానమైన విద్యకు సంబంధించిన‌ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు . లోతుగా పాతుకుపోయిన నిర్మాణాత్మక అసమానతలను పరిష్కరించడానికి బలమైన ప్రపంచ సహకారం అవసరాన్ని హైలైట్ చేశారు రాహుల్ గాంధీ.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *