అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

Spread the love

శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి 25 ఎక‌రాలు

తిరుమ‌ల : అస్సాం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ చైర్మ‌న్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న మేర‌కు 10 ఎక‌రాల‌కు బ‌దులు 25 ఎక‌రాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ఓకే చెప్పార‌ని ఆ రాష్ట్ర సీఎస్ లేఖ ద్వారా టీటీడీకి తెలియ చేశారు. ఈ విష‌యాన్ని చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆదివారం మీడియాకు వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో శ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ, సిల్చార్ లేదా డిబ్రూగఢ్ బదులుగా అస్సాం రాజధాని గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయించాలని ఏపీ సీఎం కోరారు. ఈశాన్య భారతదేశానికి గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్నందున, భక్తుల సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటి ధార్మిక కార్యక్రమాలతో కూడిన దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించాలని సిఫార్సు చేశారు. అలాగే ప్రతిపాదిత స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అస్సాం ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించాలని ఏపీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు అంగీకరించారు. ఈ అంశాన్ని సౌహార్దపూర్వకంగా పరిష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ , అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపున‌కు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసి, ఈశాన్య భారతదేశంలో తొలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అస్సాం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.

  • Related Posts

    శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    Spread the love

    Spread the loveతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శేషాచ‌లం అడ‌వుల్లో దివ్య ఔష‌ధ వ‌నం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేర‌కు టీటీడీ…

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    Spread the love

    Spread the loveహెచ్చ‌రించిన తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండద‌ని స్ప‌ష్టం చేశారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసుల‌కు టీటీడీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *