శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

Spread the love

క‌ల్పించాల‌ని ఆదేశించిన ఈవో సింఘాల్

తిరుప‌తి : శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. త‌న అధ్య‌క్ష‌త‌న టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఛాన‌ల్ సీఈవోతో పాటు ఇత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు అనిల్ కుమార్ సింఘాల్. భ‌క్తుల‌కు ఆహ్లాదం క‌లిగించ‌డంతో పాటు స్వామి వారి విశిష్ట‌త‌, చ‌రిత్ర‌ను తెలిపేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని సూచించారు.

ఎస్వీబీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం మరో రెండేళ్ల పాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు అనిల్ కుమార్ సింఘాల్.
టిటిడిలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఎం.డి. ఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ముస్లిం వర్గాలుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించరాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీబీసీ బోర్డు సభ్యులు బీ. ఆనందసాయి, ఎం.ఎస్. రాజులు వర్చువల్ గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇంఛార్జి సీఈవో డి. పణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    Spread the love

    Spread the loveతిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శేషాచ‌లం అడ‌వుల్లో దివ్య ఔష‌ధ వ‌నం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేర‌కు టీటీడీ…

    అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveశ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి 25 ఎక‌రాలు తిరుమ‌ల : అస్సాం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ చైర్మ‌న్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న మేర‌కు 10 ఎక‌రాల‌కు బ‌దులు 25 ఎక‌రాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *