మిరాయ్ ద‌ర్శ‌కుడు..న‌టుడికి ఆర్జీవీ ప్ర‌శంస‌

ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చినందుకు అభినంద‌న‌లు

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది మిరాయ్. ఆశించిన దానికంటే ఎక్కువ‌గా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు తేజ స‌జ్జా. శ్రేయ శ‌ర‌ణ్, జ‌గ‌ప‌తి బాబు, మంచు మ‌నోజ్ ఇత‌ర పాత్ర‌ల‌లో జీవించారు. శుక్ర‌వారం విడుద‌లైంది. మంచి మార్కులు ప‌డ్డాయి. ఉత్కంఠ భ‌రితంగా, అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ సంద‌ర్బంగా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు ఒక్క‌రొక్క‌రు సినిమా గురించి త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ త‌రుణంలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన ఆర్జీవీ ఉన్న‌ట్టుండి త‌న స్పంద‌న‌ను తెలిపారు.

ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎక్స్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు మిరాయ్ గురించి. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని, నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ లకు ప్ర‌త్యేక అభినంద‌న‌లు. బాహుబలి తర్వాత నేను మరే ఇతర చిత్రానికి మిరాయ్ కి ఇంతటి ఏకగ్రీవ ప్రశంసలు వినలేదని పేర్కొన్నాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌ధానంగా వీఎఫ్ఎక్స్ , క‌థ‌నం రెండూ హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు స‌రిపోయేలా ఉన్నాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన కామెంట్స్ మిరాయ్ సినిమాకు మ‌రింత బ‌లాన్ని క‌లిగించేలా చేసింది. ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *