ఏపీ కూట‌మి పాల‌న అభివృద్దికి నమూనా : సీఎం

వే 2 న్యూస్ కాంక్లేవ్ లో చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రానికి ఓ విజ‌న్ ఉంద‌ని, దానిని సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాంక్లేవ్ లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం అని ప్ర‌శంసించారు. విజన్ రూపకల్పన చేయడమే కాదు, దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌టించారు. 20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ప్ర‌శంస‌లు కురిపించారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్‌గా మారింద‌ని చెప్పారు సీఎం. 2038 నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుందని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నానని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకుంటూ వ‌చ్చామ‌ని చెప్పారు. ఈ ఏడాదితో పాటు గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామ‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *