newsseals.com
News

కవిత కాంగ్రెస్ లోకి వ‌స్తానంటే వ‌ద్ద‌న్నా

VijayaBhaskar January 27, 2026
newsseals-TPCCChief
Spread the love

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు క‌విత గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌విత తాజాగా త‌న గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఆమెకు అంత సీన్ లేద‌న్నారు. త‌ను నాకు త‌న పెట్ట‌బోయే పార్టీలో జాతీయ స్థాయిలో ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. త‌న స్థాయికి మించి మాట్లాడ‌టం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ బాంబు పేల్చారు. క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న‌ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. త‌ను కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తానంటూ క‌బురు పంపించింద‌ని, అయితే తను రావ‌ద్దంటూ సూచించాన‌ని తెలిపారు. ఇది వంద శాతం వాస్త‌వ‌మ‌న్నారు. ఇందులో ఎలాంటి అబ‌ద్దం లేద‌న్నారు. ఒక‌వేళ కాద‌ని అంటే బ‌య‌ట‌కు వ‌చ్చి క‌విత చెప్పాల‌న్నారు మ‌హేష్ కుమార్ గౌడ్. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్రతిపాదన ఏఐసీసీలో వచ్చినప్పుడు తాను ఒక్క‌డినే వ్యతిరేకించాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రులు సమావేశం అవ్వడంలో తప్పేం లేద‌న్నారు.