మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఎస్ఓ మురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం, అనుబంధ ఆలయాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు , ఇతర మౌలిక వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అలాగే శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, తదితర ఆలయాలను కూడా సందర్శించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తగిన చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *