జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

గుంటూరుకు తీసుకు వెళ్లిన పోలీసులు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీ నేత‌లు దాడి చేయ‌డం, ఇంటిని , ఆఫీసును ధ్వంసం చేయ‌డం, కారు, ఫ‌ర్నీచ‌ర్ కు నిప్పంటించ‌డం విదిత‌మే. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌పై ప‌లు చోట్ల కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. రాజ‌మండ్రి జైలుకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జైలులో ఉన్న అంబ‌టి రాంబాబుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ ప‌ద్ద‌తిని అప్ప‌గించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో త‌న‌పై కేసు న‌మ‌దు చేశారు పోలీసులు. నిన్న పోలీసులు పిటీ వారెంట్ జారీ చేశారు.

ఇదే సమ‌యంలో ఉన్న‌ట్టుండి జైలులో ఉన్న త‌న‌కు షాక్ త‌గిలింది. సోమ‌వారం జారీ చేసిన పిటీ వారెంట్ కు సంబంధించి పోలీసులు రాజ‌మండ్రి జైలు వ‌ద్ద‌కు వ‌చ్చారు. పిటీ వారెంట్ ఉండ‌డంతో జైలు సూప‌రింటెండెంట్ తో అనుమ‌తి తీసుకుని గుంటూరుకు త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా గతేడాది నవంబర్‌ 12 వైసీపీ ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేష‌న్ లో అంబటి రాంబాబుపై కేసు న‌మోదు కావ‌డం విశేషం. కాగా అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *